భారత్లోనే చిక్కుకుపోయిన విదేశీ జట్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, గగనతల ఆంక్షల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఇండియాలోనే ఉండిపోయాయి. ఇప్పుడు వాటి కోసం ఐసీసీ ప్రత్యేక చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేసింది. ఈ వారాంతంలో ఈ మూడు జట్లు భారత్ నుంచి బయలుదేరనున్నాయి. ఈ శనివారం సాయంత్రం ఇంగ్లండ్ జట్టు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా లండన్కు బయలుదేరనుంది. ఇక మార్చి 1న భారత్ చేతిలో ఓడి సూపర్-8 దశలోనే నిష్క్రమించిన వెస్టిండీస్ జట్టు, సెమీస్లో కివీస్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా జట్లు కోల్కతాలోనే ఉండిపోయాయి. ఈ రెండు జట్లు ఆదివారం ఒకే చార్టర్డ్ విమానంలో కోల్కతా నుంచి జోహన్నెస్బర్గ్కు వెళ్లనున్నాయి. అక్కడి నుంచి ఆ విమానం విండీస్ ఆటగాళ్లతో ఆంటిగ్వాకు వెళ్లనున్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

రింకూ ‘సింహగర్జన’. ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ క్రేజీ విక్టరీ
రాజస్థాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఓటమి అంచున ఉన్న జట్టును రింకూ సింగ్ (53*), అనుకుల్ రాయ్ (29*) మెరుపు ఇన్నింగ్స్లతో గట్టెక్కించారు. అంతకుముందు వరుణ్ చక్రవర్తి (3/14) ధాటికి రాజస్థాన్ 155 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ ఖాతాలో ఇది క్రేజీ విక్టరీ!

టీ కొట్టు దగ్గర ఇషాన్ కిషన్? షాక్ అవుతున్న నెటిజన్లు
క్రికెట్ స్టార్ ఇషాన్ కిషన్ను అచ్చుగుద్దినట్లు ఉన్న వ్యక్తి టీ స్టాల్ వద్ద కనిపించడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఆ వ్యక్తి హావభావాలు, జుట్టు చూసి "ఇషాన్ టీ కొట్టు పెట్టాడా?" అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఐపీఎల్ వేళ ఈ వీడియో నెట్టింట సెన్సేషన్గా మారింది.

జియోహాట్స్టార్ షాక్.. ఈడెన్లో ఫ్యాన్స్ ఫైర్
KKR vs RR మ్యాచ్ సందర్భంగా జియోహాట్స్టార్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. లైవ్ స్ట్రీమింగ్ మధ్యలో నిలిచిపోవడం, బఫరింగ్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్తో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. కీలక సమయంలో స్ట్రీమింగ్ ఆగిపోవడంతో మ్యాచ్ చూడలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ ఫిర్యాదు చేస్తున్నారు.

జురెల్ ‘మెరుపు’ స్టంపింగ్.. సచిన్ ఫిదా!
కేకేఆర్తో పోరులో రాజస్థాన్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత స్టంపింగ్తో గ్రీన్ను అవుట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గాల్లో డైవ్ చేస్తూ జురెల్ చేసిన ఈ విన్యాసానికి క్రికెట్ లెజెండ్ సచిన్ ప్రశంసలు కురిపించారు. "మెరుపు వేగంతో అద్భుతం చేశావు ధ్రువ్" అంటూ ట్వీట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.